ఏఎస్ రావునగర్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :
ఏఎస్ రావునగర్ డివిజన్ జైజవాన్ కాలనీ రీడింగ్ రూమ్ లో గురువారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి పాకాల రాజన్న, నాయకులు తాళ్లపల్లి మేఘరాజు, సాహెబ్, సలీం, జిఎస్ఎన్ రావు, పీరా, ముత్తు, యాదగిరిరెడ్డి, ఏవీ రెడ్డి, రహమతుల్లా, విజయేందర్, సత్యనారాయణ, విజయలక్ష్మి, పద్మ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.




